– ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్
నవతెలంగాణ – రాయపోల్
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో రసాయన శాస్త్రం పీరియడ్ ల ( గంటల) ప్రకారం ప్రాతిపదికన బోధించుటకు బీఎడ్ మరియు పీజీ రసాయన శాస్త్రం పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాలతో తేది 20-07- 2024 శనివారం రోజున నేరుగా పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,200 వరకు వేతనం ఇవ్వబడును. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం మరియు పీరియడ్ ప్రకారం గౌరవ వేతనం ఇవ్వబడుతుందని తెలిపారు.