యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ భూపాలపల్లి అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ఆదేశాల మేరకు మహముత్తరం మండల కన్వీనర్ యమన్ పల్లి గ్రామానికి చెందిన కాసర్ల రాజ్ కుమార్, సభ్యులుగా ఇదే గ్రామానికి చెందిన రత్నం జనార్దన్, సింగపల్లి గ్రామానికి చెందిన కంతి మహేష్ ను శుక్రవారం నియామకం చేసినట్లుగా కాటారం డివిజన్ ఆర్టీఐ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ తెలిపారు.నూతనంగా ఎన్నికైన రాజ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు,గ్రామ స్థాయిలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా అడ్డుకట్ట వేసేందుకు లంచగొండి అధికారులకు, ప్రశ్నించే,గొంతుకనై,పనిచేస్తానని,సమాచార హక్కు చట్టం ప్రజల చేతులు, వజ్రాయుధంగా పనిచేస్తుందన్నారు. తనపై నమ్మకంతో ఎన్నిక చేసిన కాటారం డివిజన్ కన్వీనర్ కుమార్ యాదవ్,జిల్లా కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్హర్ మండల కార్యదర్శి బండి సుధాకర్ పాల్గొన్నారు.