మంచి కంటెంట్‌ ఉన్న సినిమా – వరుణ్‌తేజ్‌

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా - వరుణ్‌తేజ్‌‘ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్‌ టైగర్‌’ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న నటుడు అభినవ్‌ గోమఠం. అయితే తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో ఆయన పాపులర్‌ డైలాగ్‌ అయిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నారు రా..’ టైటిల్‌తోనే అభినవ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్‌ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్‌తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరై బిగ్‌టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’అభినవ్‌ తొలిసారిగా లీడ్‌ రోల్‌ చేస్తున్నాడు. విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఈచిత్రంతో అభినవ్‌కు మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తుంది. టీమ్‌ అంతా కాన్ఫిడెంట్‌గా ఉంది. అభినవ్‌లో నటన పరంగా మంచి షేడ్స్‌ ఉన్నాయి. చిత్రంలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయని తెలిసింది. అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో స్పెషల్‌. ఇందులో నటించడం లక్కీగా ఫీలవతున్నాను. ఈ కథ నచ్చి ఈ సినిమా చేశాను. నా సినిమా కంటెంట్‌ చూడండి. మీకు నచ్చితే సినిమా చూడండి. తప్పకుండా అందరి అభిమానంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’ అని అభినవ్‌ గోమఠం చెప్పారు. దర్శకుడు తిరుపతి రావు మాట్లాడుతూ,’అందరి సహకారంతో సినిమాని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన భవాని కాసుల మాట్లాడుతూ,’సినిమా బాగా వచ్చింది. సినిమాలోని ప్రతి పాత్ర అందరికీ రిలేట్‌గా ఉంటుంది. ఈ సినిమాకు అన్ని సమపాళ్లలో కుదిరాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వితో పాటు అలీ రైజా, రాధామోహన్‌, కార్తికేయ, మెహిన్‌, సంజీవ్‌, లావణ్య, సిద్దార్థ్‌ స్వయంభూ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.