కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యులుగా

– ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ శాఖ సంప్రదింపులు కమిటీ సభ్యులుగా ఎంపీలు మల్లు రవి, కడియం కావ్యను కేంద్రం నియమించింది. ఆ కమిటీకి చైర్మెన్‌గా కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి వ్యవహరిస్తారు. లోక్‌ సభ నుంచి ఏడుగురు, రాజ్యసభ నుంచి ఏడుగురు, ఇద్దరు ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.