ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ – మద్నూర్
జూక్కల్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ఆదేశాల మేరకు మంగళవారం నాడు మద్నూర్  మండలం లోని అంతాపూర్  గ్రామంలో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్  మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్నూర్ మాజి సర్పంచ్ దారస్ వార్ సాయిలు , మద్నూర్ మండల సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి , కొండావార్ గంగాధర్  , రమేష్ వట్నాల్ వార్ , కొండవార్ రాజు, ఈరన్న  అంతపూర్ గంగాధర్ , కాంగ్రెస్ పార్టీ అంతపూర్ గ్రామ అధ్యక్షుడు దత్తు  , శంకర్ పటేల్ , అంతపూర్ తాజా మాజీ సర్పంచ్ సుగుణ బాయి రాజు , అఖిల్ , అంకుష్ పటేల్ ఇతరులు పాల్గొన్నారు.