ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలి.

నవతెలంగాణ – చిన్నకోడూరు 

ప్రజలకు అనేక సేవలు చేస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏఐకేఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి అన్నారు.సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్స్ ధర్నా చేసి వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని కాని ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.18 వేల రూపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు టీబీ, లెప్రసి, కంటి వెలుగు సంబంధించిన తదితర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించి వాలంటీర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ సంతోష, పద్మ, భార్గవి, విజయ, లక్ష్మి, నీరజ,విజయలక్ష్మి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు