సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పిడియాట్రిక్‌తో పాటు వివిధ విభాగాల్లో భర్తీ
నవతెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, కషితో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోని పాథాలజీ (1), మైక్రోబయోలజీ (1), కమ్యూనిటీ మెడిసిన్‌ (2), జనరల్‌ మెడిసిన్‌ (4), పిడియాట్రిక్‌ (3), డివిఎల్‌ (1), సైకియాట్రీ (1), రేడియాలజీ (1), జనరల్‌ సర్జరీ (4), ఆర్థోపెడిక్‌ (2), ఈఎన్‌టీ (1), గైనకాలజీ (4), అనస్థీషియా (3) తో పాటు మొత్తం 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు
ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మరోవైపు జిల్లాకో మెడికల్‌ కళాశాలను తీసుకొచ్చి వైద్య విద్యను చేరువ చేసింది. జిల్లాకు 28 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు