సైఫ్ జోన్ అధికారులతో అసోచామ్ బి2బి సమావేశం

నవతెలంగాణ హైదరాబాద్: అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్ ), షార్జా, యూఏఈ  ప్రభుత్వం సహకారంతో మరియు తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతుతో, ఐటిసి  కాకతీయ హోటల్‌లో జూలై 22-23, 2024న “యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం” అనే శీర్షికతో బి2బి సమావేశాల శ్రేణిని విజయవంతంగా నిర్వహించింది. యూఏఈ లోని షార్జా ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ (సైఫ్ ) జోన్ అందించే లాభదాయకమైన అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తిగా ఉన్న 85 కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యంతో ఈ ఈవెంట్‌కు అద్భుతమైన స్పందన లభించింది.  ఈ సమావేశాలలో  యూఏఈ మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలలో అందుబాటులో ఉన్న విభిన్న వ్యాపార మరియు పెట్టుబడి అవకాశాలపై పరిజ్ఙానం అందించటంతో పాటుగా  అక్కడ వ్యాపారాలను చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, విదేశీ కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు గురించి వెల్లడించారు. అలాగే, భారతీయ కంపెనీలు తమ మార్కెట్ పరిధిని ఎలా సమర్థవంతంగా విస్తరించుకోవచ్చో నిపుణులు తెలిపారు.
అసోచామ్  ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ మరియు యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి శ్రీ రవి కుమార్ రెడ్డి కటారు మాట్లాడుతూ  “ ఈ బి2బి  సమావేశాలు భారతీయ వ్యాపారాలు నేరుగా అధికారులతో నిమగ్నమవ్వడానికి ఒక ప్రత్యేక వేదికను అందించాయి. 85కి పైగా కంపెనీల నుండి ఉత్సాహభరితమైన భాగస్వామ్యం అంతర్జాతీయ మార్కెట్‌లకు యూఏఈని ఒక గేట్‌వేగా మార్చడానికి పెరుగుతున్న ఆసక్తిని నొక్కి చెబుతుంది” అని అన్నారు.