నవతెలంగాణ – హైదరాబాద్
షార్జా, యూఏఈ ప్రభుత్వం సహకారంతో, “యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం” అనే అంశంపై ప్రత్యేకమైన బి2బి సమావేశాలను తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతుతో నిర్వహించనున్నట్టు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్ ) ప్రకటించింది. ఈ సమావేశాలు 2024 జూలై 22 మరియు 23 తేదీలలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు హోటల్ ఐటిసి కాకతీయ, 6-3-1187 , బేగంపేట్, హైదరాబాద్ -500016 వద్ద జరుగుతాయి. వ్యాపార ప్రోత్సాహకాలు, సున్నా పన్నులు, వేగంగా కంపెనీ రిజిస్ట్రేషన్ మరియు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, రష్యా మరియు యూరప్లో వ్యూహాత్మక మార్కెట్ లను చేరుకోవడంతో సహా, యూఏఈ లో వ్యాపార కార్యకలాపాల ప్రారంభించే అవకాశాలు మరియు ప్రయోజనాలను గురించి భారతీయ వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించటం ఈ సమావేశాల లక్ష్యం. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ మరియు యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి శ్రీ రవి కుమార్ రెడ్డి కటారు మాట్లాడుతూ “యూరప్, ఆఫ్రికా మరియు మధ్య ఆసియాలో విస్తరించాలనే లక్ష్యం కలిగిన భారతీయ వ్యాపారాలకు యూఏఈ ఒక ప్రాధాన్య ఎంపికగా ఉద్భవించింది. పారిశ్రామికవేత్తల్లో అవగాహన పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలు వృద్ధి చెందేందుకు అవసరమైన సహకారాన్ని అందించడానికి ఈ సమావేశాలు రూపొందించబడ్డాయి” అని అన్నారు. భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను విదేశీ మార్కెట్లు మరియు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, రష్యా మరియు ఐరోపాలో తమ మార్కెట్ పరిధిని ఎలా విస్తరించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని అసోచామ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ హెడ్ మచ్చా దినేష్ బాబు వివరించారు. ఈ సమావేశాలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, కానీ ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నమోదు చేసుకోవడానికి, దయచేసి ఈ నంబర్ +91-9295959456లో శ్రీ కొత్తపేట విశ్వానంద్ను సంప్రదించండి లేదా kothapata.vishwanand@assocham.comకు ఇమెయిల్ రాయండి.