వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి కృషి : ఏవో రాజు

నవతెలంగాణ – మద్నూర్
మండల వ్యవసాయ శాఖ ద్వారా మండల వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేకంగా అధికారులు కృషి చేస్తున్నారని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. శుక్రవారం నాడు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వ్యవసాయదారులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ జెండావిష్కరణ కార్యక్రమంలో మండలంలోని ఏఈవోలు పాల్గొన్నారు.