– శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్..
– భారీగా ఐఏఎస్ల బదిలీలు
అమరావతి: చంద్రబాబు సీఎం అయ్యాక..మార్పులు షురూ అయ్యాయి. మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక.. వైఎస్ జగన్ హయాంలో చక్రం తిప్పిన అధికారులకు బదిలీ వేటు పడింది. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్లను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచా యతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, పౌరసరఫరాలశాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్గౌర్, నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్గౌర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్కు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా ఎ.బాబు, ఏపీ సీఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి, పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్, గనులశాఖ డైరెక్టర్, కమిషనర్గా ప్రవీణ్కుమార్, ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మురళీధర్రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినరు చంద్ను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.