నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని పీహేచ్సీ అవరణం ముందు సిబ్బంది బతుకమ్మ పండుగ సంబురాలు మంగళవారం జరుపుకున్నారు. వైద్యురాలు నసీమా ఉన్నీసా బేగం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని, తమ వేతనాలు పెంచాలని ఆశాకార్యకర్తలు పీహేచ్ సీ అవరణం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచాలని ఆశాకార్యకర్తలు డిమాండ్ చేశారు. బాగ్యలక్ష్మి, సౌమ్య,రేణుక,రజిత,వెంకటలక్ష్మి,రజిని,తదితరులు పాల్గొన్నారు.