బీసీలకు అసెంబ్లీలో 60 టికెట్లు కేటాయించాలి

– చింత నిప్పుల బిక్షపతి బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్రంలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలకు అసెంబ్లీలో 60 టికెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు చింత నిప్పుల  బిక్షపతి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.  బుధవారం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  బీసీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు చింతనపుల బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల పదవ తారీకు హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో జరుగు బీసీల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు 60 టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీలను ఆయన డిమాండ్ చేశారు జెండాలు మోసేది మనం జిందాబాద్ లు కొట్టేది మనం కానీ రాజ్యాధికారంలో మన వాటా దక్కకుండా చేస్తున్న అగ్రకుల కుట్రలను బద్దలు కొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు సరూర్నగర్ స్టేడియంలో జరుగు బీసీల సింహగర్జన విజయవంతం చేసి మన ఓటు మనకు వేసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రశేఖర్ బక్తోజు బ్రహ్మచారి మోదాల సైదులు సంఘ సురేందర్ కోడి మల్లయ్య చల్ల ప్రసాద్ సిగ్గోజు రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.