– ఐఎస్ హస్తమా..లేక ఎవరు
– ఎఫ్ఎస్బీ ఆరా
రష్యా రాజధానికి వాయవ్య దిశలో సంగీత ఉత్సవాలకు వేదిక అయిన క్రోకస్ సిటీ హాల్ శుక్రవారం అర్థరాత్రి టెర్రరిస్టు దాడికి గురైంది. టెర్రరిస్టులు అసాల్ట్ రైఫిల్స్ తో సందర్శకులపై దాడి సంఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు టెర్రరిస్టులు భవనంలో పెద్ద ఎత్తున మంటలను సృష్టించారు. నరమేధానికి పాల్పడిన నలుగురు ప్రత్యక్ష టెర్రరిస్టులతో సహా 11 మందిని , పాయింట్-బ్లాంక్ రేంజ్లో వారిని కనపడకుండా కాల్చడం జరిగింది. పక్కనే ఉన్న షాపింగ్ మాల్ను కూడా టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుని, దానికి నిప్పంటించారు. శనివారం అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) తెలిపింది. నలుగురు నిందితులు ఉక్రెయిన్కు పారిపోయే క్రమంలో పట్టుబడ్డారని ఏజెన్సీ తెలిపింది. దాడిలో మరణించిన వారి సంఖ్య 150కి చేరుకుందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. ఈ టెర్రరిస్టు కాల్పుల్లో 200 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేరారని మాస్కో రీజియన్ అధికారులు చెప్పార
నిందితుల గుర్తింపు గురించి, దాడికి సంబంధించిన పరిస్థితుల గురించి సమాచారం ఇంకా పూర్తిగా వెలువడలేదు. దాడి జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారం చేయబడిందని, ఎక్కువగా ప్రాణనష్టం జరిగేలా చూడటం జరిగిందని ఎఫ్ ఎస్బీ పేర్కొంది. ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి: నలుగురు ప్రాథమిక అనుమానితులను ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్టు ఎఫ్ ఎస్బీ ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లటి రెనాల్ట్ క్లియో కారులో పారిపోతున్న టెర్రరిస్టులను రష్యన్ లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు కొద్దిసేపు వెంబడించిన తరువాత, అనుమానితులు కారును విడిచిపెట్టారని, వారిలో ఒకరిని అక్కడే అదుపులోకి తీసుకోగా, ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు రష్యన్ మీడియా రిపోర్ట్ చేసింది. దాడికి పాల్పడిన నలుగురితో సహా ఈ సంఘటనకు సంబంధించి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు శనివారం ఎఫ్ ఎస్ బీ ఒక ప్రకటనను విడుదల చేసింది. పట్టుబడిన పదకొండు మంది పేర్లు లేదా జాతీయతలపై రష్యన్ అధికారులు ఎటువంటి డేటాను విడుదల చేయలేదు. ప్రాథమిక అనుమానితుల్లో ఎవరికీ రష్యా పౌరసత్వం లేదని రష్యా అంతర్గత మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
అనుమానితులలో ఒకరు ”డబ్బు కోసం” నేరానికి పాల్పడ్డానని పేర్కొన్నట్టు లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అతనిని విచారిస్తున్న సమయంలో చిత్రీకరించిన విడియోలో కనపడింది. ఆ వ్యక్తి తనకు 500,000 రూబిళ్లు (5,418 యూఎస్డాలర్లు) ఇస్తానని వాగ్దానం చేశారని, దాడికి ముందు తన డెబిట్ కార్డ్ అకౌంట్కు సగం బదిలీ చేశారని పేర్కొన్నాడు. శుక్రవారం నాటి దాడి సూత్రధారులను సంప్రదించడానికి ముందు సుమారు ఒక నెల క్రితం తాను టెలిగ్రామ్లో కొంతకాలంగా ”ఒక బోధకుడి ద్వారా ఉపన్యాసాలు వింటున్నానని” ఆ అనుమానిత టెర్రరిస్టు చెప్పాడు. బహిరంగంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అనుమానితుల్లో ఎవరూ ఏ తీవ్రవాద గ్రూపుకు విధేయత చూపలేదు.
రష్యా దర్యాప్తు అధికారులు దాడి వెనుక అనుమానిత సంస్థల పేర్లను పేర్కొనలేదు. ఉక్రెయిన్లోకి ప్రవేశించడానికి టెర్రరిస్టులకు ఉపయోగపడిన కొన్ని ఉక్రేనియన్ ”పరిచయాలు” మినహా, ప్రాథమిక అనుమానితులకు ఏదైనా తీవ్రవాద సమూహాలతో లేదా బయటి శక్తులతో వారికిగల సంబంధాలపైన ఇంకా స్పష్టత రాలేదని ఎఫ్ ఎస్ బీ తెలిపింది. రాయిటర్స్, సీఎన్ఎన్తో సహా కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇస్లామిక్ స్టేట్ (గతంలో ఐఎస్) దాడికి బాధ్యత వహించినట్టు రిపోర్ట్ చేశాయి. అయితే టెర్రరిస్టులు ఐఎస్ కు అనుబంధంగా ఉన్నారనే వాదనలపై మాస్కో వ్యాఖ్యానించలేదు.