రైల్లో బెల్ పూరి అమ్మే వ్యక్తి మృతి

Bell puri seller dies in train– వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి 
– పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి 
నవతెలంగాణ –  కామారెడ్డి
రైల్లో బెల్ పూరి అమ్మే వ్యక్తి మృతి చెందాడని, ఇతని వివరాలు తెలిసినవారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలనీ  పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం  ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సోమవారం తెల్లవారుజామున కామారెడ్డి పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక షాప్ ముందర పడుకొని, అక్కడనే మృతి చెంది ఉన్నాడని,  ఇతని వయసు సుమారు 45-50 సంవత్సరాలు ఉండవచ్చని,  ఇతడు రైలులో బెల్ పూరీ అమ్ముతాడని అతనిని చూసినవారు పేర్కొన్నారు. ఇతని వివరాలు తెలిసిన ఎవరైనా  కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యక్తి యొక్క మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో  భద్రపరచడం జరిగిందని మరింత సమాచారం కోసం 8712686145,

8712666242. ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.