
మండలానికి చెందిన పలు అధికారులకు జిల్లాస్థాయిలో ఉత్తమ సేవ పురస్కారాలు లభించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మిని స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గేట్ టూ గేదెర్ కార్యక్రమాలలో ఎస్పీ జానకి షర్మిల అందజేశారు. లోకేశ్వరం ఎంపీడీఓ సోలమన్ రాజ్, ఎస్ఐ సక్రియా నాయక్ ఉత్తమ సేవ అవార్డులు అందుకున్నారు.
