
– ఉపాది కూలీలకు మజ్జిక, అరటి పండ్లు పంపిణీ
– శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బడుగు,బలహీన వర్గాలకు భరోసా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని,కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు న్యాయ గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ చేతిగుర్తుకు ఓటువేసి గెలిపించాలని మంథని నియోజకవర్గంలో చెరువుల ఉన్న ఉపాధి హామీ కూలీలను అభ్యర్దిoచారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ,అరటి పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400,పని దినాలు పెంచడం గ్యారెంటీన్నారు.ఎన్నికలు కోడ్ తరువాత రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందన్నారు.శ్రీమతి సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగిందని,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర.ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూపాయలు రూ.400 పెంపు.ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా రూ.లక్ష, ఆరోగ్య బీమా రూ.25 లక్షలు, యువతకు 30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.