గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మంగళవారం మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. టీజర్ని 5న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్లో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. హై స్టాండర్డ్ టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.