నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేసినట్లు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ డా ఆర్. భూపతిరెడ్డి సహకారంతో తోర్లికొండ గ్రామ అభివృద్ధికి రూ.5 లక్షల రూపాయలు మంజూరు చేయడం వలన తోర్లికొండ గ్రామంలో 5 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గెలిచినా అనతి కాలంలోనే గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే కి గ్రామ నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కనక రవి, నల్ల గంగారెడ్డి, సాయి రెడ్డి, మునిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి , నర్సారెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షులు తాజుద్దీన్, సెక్రటరీ వినోద్, ప్రధాన కార్యదర్శి కనక రాకేష్. కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.