నవ్విస్తూనే భయ పెట్టే భూతాల బంగ్లా

నవ్విస్తూనే
భయ పెట్టే
భూతాల బంగ్లాతమిళ నటుడు సంతానం హీరోగా నటించిన హిలేరియస్‌ యూనిక్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డీడీ రిటర్న్స్‌’. సురభి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి యస్‌. ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్‌ పై సి. రమేష్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 29న తమిళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని, ఇప్పటికీ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రతిష్టాత్మక నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్‌ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై నిర్మాతలు ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్‌ ఈనెల 18న ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ పేరుతో తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో యూనిట్‌ తెలుగు ట్రైలర్‌ని లాంచ్‌ చేసింది.
హీరో సంతానం మాట్లాడుతూ.. ‘నా సినిమాని తెలుగులో విడుదల చేయడం నా డ్రీమ్‌. మంచి ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూశాను.
నా సినిమా విడుదలైతే అందరూ ఎంజారు చేసేలా ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ చిత్రంతో తెలుగులోకి రావడం ఆనందంగా వుంది. అందరూ ఎంజారు చేసే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు రియల్‌ సినిమా లవర్స్‌. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ ప్రోత్సాహంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ని సాధించింది. ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇదొక రోలర్‌ కోస్టర్‌ ఫన్‌ రైడ్‌. హర్రర్‌ కామెడీ విత్‌ గేమ్‌తో ఉన్న ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాలా ఎంజారు చేస్తారు. చాలా యూనిక్‌గా ఉంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని తెలిపారు. ‘తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాం. సంతానంతో పని చేయడం గొప్ప అనుభవం’ అని సురభి చెప్పారు.
దర్శకుడు ప్రేమ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ,’ఇది నా మొదటి చిత్రం. ఈ చిత్రం తెలుగులో విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది చాలా జారు ఫుల్‌ మూవీ. ఫ్యామిలీ, కిడ్స్‌ ప్రత్యేకంగా ఎంజారు చేస్తారు’ అని అన్నారు. ‘ఈ చిత్రం సంతానం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు నలభై కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇంటిల్లాపాది చూడదగ్గ చిత్రమిది. తమిళ్‌ లానే తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది బాగా నచ్చుతుంది’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ చెప్పారు. మరో నిర్మాత వాకాడ అప్పారావు మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు రావడం అరుదు’ అని తెలిపారు.