కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారి బ్లాక్ బస్టర్ ‘విక్రాంత్ రోణ’ తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం కలిశారు. ‘హనుమాన్’తో పాన్ ఇండియన్ బ్లాక్బస్టర్ అందుకున్న నిర్మాతలు కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హై బడ్జెట్, భారీ కాన్వాస్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యూచర్లో జరగబోయే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా’ అఫీషియల్ లోగోని మేకర్స్ రివీల్ చేశారు. యూనిక్ అప్రోచ్ సినిమాలు చేయడంలో అనూప్ భండారి దిట్ట.
ఈ వీడియో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించి గ్లింప్స్ని అందిస్తోంది. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ స్మాష్ అయినట్లుగా చూపిస్తూ, ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు, క్లైమట్స్ యాడ్ చేశారు. అనూప్ భండారీ ఎగ్జైటింగ్ డీటెయిల్స్తో విజువల్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు.
డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడుతూ, ”విక్రాంత్ రోణ’ తర్వాత నిరంజన్ రెడ్డి నాతో కలిసి పనిచేయాలనుకున్నారు. మేము ఇంతకు ముందు ‘హనుమాన్’ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కలుసుకున్నాం. నా నెక్ట్స్ చిత్రం కూడా కిచ్చా సుదీప్తోనే ఉంటుందని, ‘బిల్లా రంగ బాషా’ కథని, దాని వరల్డ్ని వివరించినప్పుడు ఆయన థ్రిల్ అయ్యారు. వారు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ను పెద్ద ఎత్తున నిర్మించాలని కోరుకున్నారు. దీనికి ‘బిల్లా రంగ బాషా’ పర్ఫెక్ట్’ అని అన్నారు.
‘కిచ్చా సుదీప్తో అనూప్ భండారి సినిమా చేస్తున్నారని మొదట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. ‘విక్రాంత్ రోనా’ తెలుగులో విజయవంతమైంది. ఈ కొలాబరేషన్ ఇప్పటికే సంచలనం సష్టించింది. ‘బిల్లా రంగ బాషా’ కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలి అనే నమ్మకం కలిగింది’ అని నిర్మాతలు తెలిపారు. అన్ని ప్రధాన భారతీయ భాషలలో ఈ సినిమా నిర్మాణమౌతుంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.