
శంకు చక్ర నామాలతో సర్పాకారములో సిరియాల సింహం వలె స్వయంభుగా ఈ కొండ గుహలో వెలసినాడు ఈ స్వామి వారిని అంబరీష్యుడు అనే మహాముని దేశ సంచారం చేస్తూ ఈ గుహ లో తపస్సు చేసుకొనుటకు అనువుగా ఉందని నచ్చి తపస్సు చేసుకొనుచుండగా రాక్షసులు తన తపస్సును భంగం చేస్తుండగా నరసింహుడి భక్తుడైన అంబరీష్యుడు స్వామి వారిని వేడుకొనగా స్వామి వారు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రాన్ని వదిలి రాక్షసులను సంహరించి అంబరీష్యుని రక్షణకై ఇక్కడే నిలిచినాడు అని పూర్వీకులు చెబుతుంటారు. ఈ స్వామివారిని సర్దార్ సర్వాయిపాపన్న గోల్కొండ కోటకు వెళుతున్నప్పుడు దారిలో ఈ స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లేవాడంట ఇప్పటికీ ఈ గుట్ట పక్కన ఉన్న రమణానంద ఆశ్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న తలదాచుకునే ఒక పెద్ద బండరాయి ఉంటుంది దీనిని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు సర్వాయి పాపని గుండు అని పిలుస్తుంటారు ఈ స్వామిని 1850 సంవత్సరం లో బత్తిని అర్వపెళ్లి గౌడ్ అనే భక్తుడు అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి వరాన జన్మించినాడు తల్లిదండ్రులను విడిచి వారికి చెప్పకుండా సూర్యాపేట వద్ద ఉన్న అర్వపల్లి దేవాలయంలో ఉంటుండగా భక్తుడైన అర్వపల్లికి 12 వ ఏట స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి నాయనా నేను మీ నమాత్ పెళ్లి గ్రామానికి తూర్పున ఎన్నో సంవత్సరాలక్రితం వెలిసినానని నీవు వచ్చి దర్షించుకొని నా సేవ చేస్తూ నీ తల్లిదండ్రుల సేవ కూడా చేసుకో అని చెప్పగా వెంటనే అర్వపల్లి నమాత్ పెళ్లి తిరిగి వచ్చి కొండల గుహలో ఉన్న స్వయంభు గా వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారి సేవ చేస్తూ ఉండేవాడంట తన ఆవుల మందకు మేకల మందకు గుట్ట పైన ఉన్న పులి సింహా లతో రక్షణ పెట్టి తను తపస్సు చేసుకునేవాడని పెద్దలు చెబుతుంటారు తన 22వ ఏటా స్వామివారి ప్రత్యక్షమై నీవు వివాహం చేసుకొని సంసార జీవితంలోకి వెళ్ళు నాకు అప్పయ్య అనే బ్రాహ్మణ బాలుడు జగదేవపూర్ వద్ద ఉన్న మరి కుక్కు గ్రామంలో నా సేవకై పుట్టాడు అతన్ని తీసుకువచ్చి నా సేవలో పెట్టి నీవు సంసారం జీవితంలో గడుపుతూ నా సేవ చేయమని స్వామి వారు చెప్పాడంట వెంటనే అర్వపల్లి గారు మరి కుక్కు గ్రామం వెళ్లి అప్పయ్య అనే బాలుడిని తీసుకువచ్చి స్వామివారి సేవకై పెట్టి తన సంసార జీవితంలో వెళ్ళినాడు అట్లా అట్లా స్వామివారి సేవ చేస్తూ ఇరువురు మరణించినారు వారి కుటుంబ సభ్యులు గ్రామస్థులు స్వామి వారి సేవ చేసేవారు, ప్రతి సంవత్సరం గ్రామస్తులు మరియు పక్క గ్రామాల వారు కృష్ణాష్టమి రోజున ఉట్లు కొట్టి స్వామివారి వేడుకలు చేసేవారు 2016 జనవరి నెలలో వారి కుటుంబ సభ్యుడు అయిన బత్తిని రాములు గౌడ్ కి స్వామివారు కలలో ఎన్నోసార్లు కనిపించి తన దర్శనానికి రావలసందిగా చెప్పగా ఇది కల అని అతను పట్టించుకోలేదు ఒకరోజు తను ఉద్యోగరీత్యా యాదగిరిగుట్టకు వెళుచుండగా మార్గమధ్యలో రాయగిరి వద్ద ఒక రోడ్డు ప్రమాదానికి గురి అయినాడు అట్టి ప్రమాదంలో తన ద్విచక్ర వాహనం లారీ చక్రాల కింద పడి డ్యామేజ్ అయింది కానీ రాములు గారికి ఎలాంటి గాయాలు కాలేదు ఇంత పెద్ద ప్రమాదంలో బతికి బయటపడిన అతను ఇది కచ్చితంగా లక్ష్మీనరసింహస్వామి దయ వల్లనే ప్రమాదం నుండి బయటపడ్డానని అని వెంటనే అతను ఇంటికి వచ్చి తన చిన్నాన కొడుకు అయిన బత్తిని సుధాకర్ గారిని వెంట పెట్టుకొని ఇప్పుడు పిలిచే పూర్ణగిరి (బోడగుట్ట) గుడిదగ్గరకు వెళ్ళినాడు గుడిలో పెద్ద పెద్ద చెట్లు తీగలు స్వామి వారి పైన కప్పబడ్డాయి పైకి వెళ్లి చెట్లను మరియు తీగలను తొలగించి వెంట తెచ్చుకున్న నీళ్లను పంచామృతాలను స్వామివారి పైన పోసి అభిషేకించి పూల మాలను పండ్లను పెట్టి క్రిందకు దిగే క్రమంలో స్వామి వారి పైన పెద్ద నాగుపాము కృష్ణ లీలాలు కలిగి బంగారువన్నె తో దర్శనమిచ్చింది ఈ విషయము గ్రామ ప్రజలకు భక్తులకు తెలిసి తండోవతండాలుగా పూర్ణగిరికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఇట్టి విషయంలో 2016 సంవత్సరంలో మీడియా సోషల్ మీడియా పత్రికలలో వచ్చింది జరిగిన విషయాన్ని నమాత్ పెళ్లి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు ప్రజలకు బత్తిని రాములు గారు తెలియపరిచారు అప్పటినుండి ఇప్పటివరకు గ్రామస్తులు పెద్దలు దాతల సహకారంతో అంచలంచలుగా గుడిని నిర్మించుకొని ప్రజలకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసినారు ఈ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి స్వామి వారు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేడు చెన్నైలో మాత్రమే ఉన్నది అని జీయర్లు పండితులు చెబుతున్నారు ఈ కొండ పైన వేలాది వనమూలికలు ఉన్నాయని ఈ కొండ పైన పది నిమిషాలు కూర్చుంటే వనమూలికల గాలి పీల్చిన ఎన్నో దీర్ఘ రోగాలు నయం అవుతాయని చెబుతుంటారు స్వామివారి గుండెల్లో ఉండి వచ్చే నీరు తీర్థంగా సేవించిన ఎన్నో జబ్బులు నయం అవుతాయని అలాగే ఈ స్వామివారిని దర్శించుకుంటే సంతానం ఉద్యోగం రుణ బాధలు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ స్వామి వారి కొండ కింద ఉన్న కోనేరులో ఇప్పటికీ స్వామి వారి దివ్య సర్పం ప్రతిస్వాది నక్షత్రానికి కోనేరులోకి వచ్చి దర్శనమిస్తుంది స్వామివారి దేవాలయంలో ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారికి శంకు చక్ర నామాలు కలిగి ఉంటాడు ఈ స్వామివారి దర్శనానికి చుట్టుపక్క గ్రామస్తుల కాకుండా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు ఇట్టి దేవాలయం భువనరుకి 12కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
