నవతెలంగాణాముత్తారం: కాంగ్రెస్ పార్టీ ముత్తారం మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు తనయుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోదరుడు, కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ళ శ్రీనుబాబు జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అడుగు జాడల్లో కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు మంథని నియోజక వర్గంలో తండ్రి మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు పేరిట అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని, నియోజక వర్గంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా, బిసి సెల్ మండల అధ్యక్షులు అల్లం కుమారస్వామి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుచ్చం రావు, బక్కతట్ల కుమార్,ఆనంద్, లక్ష్మన్, విజయ్, రత్నాకర్, కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గన్నారు.అదేవిధంగా హైదరాబాద్ ఐడిపిఎల్ లేక్ వద్ద ఎన్ఎస్యు జిల్లాజనరల్ సెక్రటరీ చెనవేన సాయి కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.