
– విభజన హామీలు అమలు ఏమైంది..!
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో నష్టపోయిన రైతాంగాన్ని ఏనాడు ఆదుకోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నేడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని హలో వార్డులలో ఉదయం మార్నింగ్ వాక్ చేశారు. వార్డులలోని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు రావడంతో బీజేపీ, బీఆర్ఎస్ కు రైతుల బాధలు గుర్తుకొస్తున్నాయన్నారు. బండి సంజయ్ రాష్ట్రంలో దీక్ష చేయడం కంటే రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర దీక్ష చేయాలన్నారు. గత వర్షాకాలలొ వర్షాలు పడలేదాని గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయన్నారు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న వ్యక్తులకు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇచ్చిన విభజన హామీలు అమలు ఏమైందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కొరకు మొన్నటి దాక రాముడి ఫొటో పెట్టుకునీ నరేంద్ర మోడీ ఫొటో బంద్ చేశారన్నారు. కాళేశ్వరం మునిగితే, క్రుంగితే సలహాలు ఇవ్వని కేసిఆర్ పొలాల బాట పట్టారన్నారు. కరువును రాజకీయం చేస్తూ రైతులను రెచ్చగొడుతు రైతుల పొలాల దగ్గర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ తో కలిసొస్తే ప్రధాన మంత్రి దగ్గర ప్రకృతి వైపరీత్యం సహకారం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రభుత్వానికి సహకరించి కేంద్రం పై ఒత్తిడి తెద్దామని పడుతున్నట్లు తెలిపారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో ఆరేపల్లి లో ఇటీవల మరణించిన కాశబోయిన ప్రభాకర్ కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిలిగెండ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి , మండల అధ్యక్షులు బంక చందు, మడప జైపాల్ రెడ్డి, చిత్తారి రవీందర్ అక్కు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.