బీజేపీ, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి, రాంపూర్ తండా కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమోల్లా దత్తద్రి, విజయ్, సహకార సొసైటీ చైర్మన్ తరచంద్ నాయక్ ల అద్వర్యంలో బీజేపీ, బీపఅర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లో శుక్రవారం చేరారు.చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి  అహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూగ్రామం, తండా కు చెందిన  బీజేపీ, బీఅర్ఎస్  పార్టీ ల నాయకులు, కార్యకర్తలు స్వచ్చందంగా చేరడం అభినందన మన్నారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని వారందరికీ సూచించారు.గ్రామంలో ఏలాంటి అబివృద్ది కావాలన్న తమవంతుగా  పాటు పడతానని, అనునిత్యం వందలాది మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు వివరించారు.రొబోవు రోజుల్లో బిఅర్ఎస్ ఖాలీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల కార్యదర్శి లచ్చమోల్లా దత్తద్రి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అరునురైన అమలు చేస్తుందని, మహిళలకు  రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ, అరోగ్య శ్రీ 10లక్షలు, 200వందల వరకు కరెంట్ ఫ్రీ, త్వరలో రేషన్ కార్డులు తదితర వాటిని అమలు చేస్తుందని వివరించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని,  మేమందరం ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, పోలసాని శ్రీనివాస్ తో పాటు బిసి, ఎస్సీ , మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.