లక్నో: ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఓ వివాహ వేడుక జరిగింది. ఒక బీజేపీ నాయకుడి కుమారుడు ఆన్లైన్ ”నికా” ద్వారా పాకిస్తాన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ అయిన తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్ను లాహౌర్ నివాసి ఆండ్లీప్ జహ్రాని వివాహం చేసుకున్నారు. రెండు పొరుగు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వరుడు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దానిని పొందలేకపోయాడు. వధువు తల్లి రానా యాస్మిన్ జైదీ అనారోగ్యంతో పాకిస్తాన్లోని ఐసియులో చేరడంతో పరిస్థితి మరింత సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకను ఆన్లైన్లో నిర్వహించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి, షాహిద్ ఒక ఇమాంబారా వద్ద ”బారాతి”తో సమావేశమై ఆన్లైన్ ”నికాహ్”లో పాల్గొన్నారు. వధువు కుటుంబం లాహౌర్ నుంచి వేడుకలో పాల్గొన్నారు. షియా మత నాయకుడు మౌలానా మహఫూజుల్ హసన్ ఖాన్ ఇస్లాంలో, ”నికాహ్” కోసం స్త్రీ యొక్క సమ్మతి చాలా అవసరమని, ఆమె దానిని మౌలానాకు తెలియజేస్తుందని వివరించారు.ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్లైన్లో ”నికాహ్” సాధ్యమవుతుందని ఆయన అన్నారు. హైదర్ తన భార్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారతీయ వీసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్ ప్రిషఉ, ఇతర అతిథులు వివాహ వేడుకకు హాజరై వరుడి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.