ఈసీ ప‌ని తీరుపై నీలి నీడ‌లు

Blue shadows on EC mode of operation– ప్రశ్నార్థకం అవుతున్న పారదర్శకత
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్‌ పనితీరుపై నీలినీడలు అలముకున్నాయి. దాని పారదర్శకత రానురానూ ప్రశ్నార్థకం అవుతోంది. గోయల్‌ రాజీనామాతో ఇప్పుడు ఈసీలో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే ఉన్నారు. గత నెలలో పదవీ విరమణ చేసిన అనూప్‌ పాండే స్థానంలో ఇప్పటి వరకూ ఎవరినీ నియమించలేదు. ఈ వారంలోనే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై ఖాళీగా ఉన్న రెండు పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ : ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల కమిషన్‌ నిర్వహించే పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభలకు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికల కమిషనే ఎన్నికలు నిర్వహిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండేలా ఈసీ చర్యలు తీసుకుంటుంది. అయితే ఇటీవలి కాలంలో దేశంలో స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిం చడం అసాధ్యంగా మారింది. ప్రజాస్వా మ్యానికి తావే లేకుండా పోతోంది. నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, పారదర్శకత, పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.
ఈబీలపై పిల్లిమొగ్గలు
ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు గత నెలలో సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత మూడు రోజుల వరకూ ఈసీ పెదవి విప్పలేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ముక్తసరిగా చెప్పారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు ఈసీ ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా ఎన్నికల బాండ్ల వివరాలను తన వెబ్‌సైట్‌లో పెట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల బాండ్ల పథకంపై ఈసీ మొదటి నుండి పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ పథకం ప్రారంభం కావడానికి ముందు దానిని వ్యతిరేకిస్తూ న్యాయ శాఖకు లేఖ రాసింది. అయితే 2021లో హఠాత్తుగా తన వైఖరిని మార్చుకుంది. ఎన్నికల బాండ్ల జారీపై స్టే విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
ఈవీఎంలు, వీవీపాట్లపై…
ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్లను ఉపయోగిం చడంపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్ల మధ్య వచ్చిన వ్యత్యాసాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ కేంద్రానికి ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఈసీ నుండి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గత జూలైలో పార్లమెంటుకు తెలియజేసింది. ఈవీఎంలను నూటికి నూరు శాతం పరిశీలించడం తిరోగమనమే అవుతుందని, అది తిరిగి పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతికి దారితీస్తుందని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈసీ తెలిపింది.
అసమ్మతి తెలిపితే అంతే
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడానికి కొద్ది నెలల ముందు అంటే 2020 ఆగస్టులో ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా తన పదవికి రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్ని కల ప్రచారం సందర్భంగా మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని లవాసా అభిప్రాయ పడ్డారు. ఈసీలో మిగిలిన ఇద్దరు సభ్యులు దీనితో ఏకీభవించకపోవడంతో కమిషన్‌ ఆదేశాలలో తన అసమ్మతిని నమోదు చేయాలని లవాసా పట్టు బట్టారు.
ఈ ఉదంతం జరిగిన తర్వాత కొన్ని వారా లకు లవాసా మొబైల్‌ ఫోన్‌ పెగాసస్‌ స్పైవేర్‌కు లక్ష్యంగా మారింది. 2019లో లవాసా భార్య, కుమా రుడు, సోదరిపై కూడా దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అయ్యే అవకా శాలు ఉన్నప్పటికీ లవాసా 2020లో కమిషన్‌కు రాజీనామా చేసి ఆసియన్‌ అభివృద్ధి బ్యాంక్‌లో ఉపాధ్యక్షుడుగా చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే పనిచేస్తున్నారు. తన రాజీనామాకు ముందు ఆయన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో ఓ వ్యాసం రాస్తూ ‘ఇది హుందాగా వ్యవహరించినందుకు లభించిన మూల్యం’ అని వ్యాఖ్యానించారు.
అర్థం చేసుకోవడం కష్టం మోడీ ప్రభుత్వ నిర్ణయంపై మాజీ ఈసీ లవాసా
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కష్టమేనని మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈసీలో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకం జరిపినప్పుడు ప్రధానితో ప్రధాన న్యాయమూర్తి ఏ సందర్భంలోనూ విభేదిం చలేదని గుర్తు చేశారు. ‘ప్రభుత్వం మొదట్లో ఎన్నికల కమిషనర్లకు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు క్యాబి నెట్‌ కార్యదర్శి హోదా ఇచ్చింది. ఆ తర్వాత వారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను పునరుద్ధరిం చింది. అయితే వారి తొలగింపు ప్రక్రియలో తేడా చూపించింది. ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదు’ అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు రాసిన వ్యాసంలో లవాసా వ్యాఖ్యానించారు.
ప్రధాని నిర్ణయం మేరకే… అరుణ్‌ గోయల్‌ రాజీనామా అనేక ప్రశ్నలు
లేవనెత్తింది. అయితే ఆయన నియామకం వివాదరహితమైనదేమీ కాదు. ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన మరునాడే 2022 నవంబర్‌ 10న ఆయన ఈసీగా నియమితులయ్యారు. ఈ హడావిడి ప్రక్రియను సుప్రీంకోర్టు తప్పు పట్టింది కూడా. ఈసీలో ఇప్పుడు ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషనర్ల పదవులను నూతన చట్టం ప్రకారం భర్తీ చేస్తారు. ఈసీలు, సీఈసీల నియామక ప్రక్రియ నుండి ప్రధాన న్యాయమూర్తిని తప్పించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని అభీష్టం మేరకే నియామకాలు జరిగి
పోతాయి. ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆయన మాట చెల్లుబాటు కాదు.