సన్నదాన్యం విక్రయించిన రైతులకు బోనస్

– ఇప్పటికే 281 క్వింటాల్  ధాన్యానికి బోనస్ :పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నదాన్యం విక్రయించిన ప్రతి రైతుకు బోనస్ వస్తుందని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఇప్ప మొoడయ్య అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్ల పిఏఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్నీ సందర్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నారు. ఇప్పటికే 281క్వింటాల్ ధాన్యానికి రూ.1.40.500 ఇచ్చిందని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం మ్యాచర్ వచ్చిన వెంటనే వ్యవసాయ అధికారులు టికెన్ ఇస్తారని, కాంట నిర్వహించిన వెంటనే నిర్వాహకులు ధాన్యం విక్రయించిన రైతుకు రశీదు ఇవ్వడం జరుగుతుందన్నారు.కేంద్రంలో మ్యాచర్ వచ్చిన ధాన్యం లేదని,మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపారు.రైతులు అపోహలు నమ్మొద్దని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,320 ఇస్తుందని,అదేవిధంగా, సాధారణ రకానికి రూ.2,300 ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, క్వింటా సన్న ధాన్యానికి అదనంగా మరో రూ.500 బోనస్ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు.