మండలం లోనీ చైల్వాయి గ్రామపంచాయతీ యందు వరంగల్ టు డిపో మేనేజర్ జోష్ణ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఆదేశానుసారం శుక్రవారం దివ్యాంగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్సు పాస్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 32 మంది దివ్యాంగులకు 50 శాతం రాయితీ బస్ పాస్ అందజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా దివ్యాంగుల అందరూ ఉపయోగించుకోవాలని జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీనివాస్ సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భారతి మేడం, యల్. శంకర్ ఆర్టిసి కంట్రోలర్ మరియు సమ్మిరెడ్డి దివ్యాంగులు పాల్గొనడం జరిగింది.