తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు అంగన్ వాడి టీచర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తల్లి పాల ప్రాముఖ్యతపై వివరించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టిస్తే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. బిడ్డకు తల్లిపాలే సురక్షితంగా,పుష్టికారంగా అన్ని రకాల పోషకాలు అందుతాయన్నారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు తప్ప వేరే ఇతర ద్రవపదార్థాలు ఇవ్వరాదన్నారు. అనంతరం డబ్బా పాలు వద్దు…అమ్మ పాలు ముద్దు అనే నినాదంతో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి హరిత, వైద్యాధికారి ప్రత్యూష, కార్యదర్శి వెన్నెల అంగన్ వాడి టీచర్లు రమాదేవి,ప్రమీల,ఆయాలు,ఆశాలు పాల్గొన్నారు.