– ఎంపీ అనిల్కుమార్ యాదవ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని ఎంపీ అనిల్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘డ్రగ్స్ బయట పడిన ప్రతిసారి వాళ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి. రాజ్ పాకాల, విజరు మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్కు సిగ్గుండాలి. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే వివాదాలకు కేంద్రం. ఒకసారి దీపావళి ఫెస్టివల్, ఇంకోసారి గృహ ప్రవేశం అంటు న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలం గాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే, వాళ్లు డ్రగ్స్ను ప్రేరేపిం చాలని చూసు ్తన్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.