బిఎస్పీ జోరుగా ప్రచారం

నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి గెలుపే లక్ష్యంగా మండల బిఎస్పీ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం మండల బిఎస్పీ అధ్యక్షుడు రాజుకుమార్ ఆధ్వర్యంలో మండలంలోని చిన్నతూoడ్ల, పెద్దతూoడ్ల, రుద్రారం గ్రామాల్లో  ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బిఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజన, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మంథనిలో చల్లా నారాయణ రెడ్డి గెలుపే దిశగా ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా,ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు బొంతల రాజు యాదవ్,రాగం ఐలయ్య యాదవ్, రాజయ్య పాల్గొన్నారు.