గిరిజన కుటుంబాలకి అండగా  బుసిరెడ్డి ఫౌండేషన్ నేనున్నానంటూ భరోసా

– మనోధైర్యంతో  అండగా నేనునుంటా అన్ని విధాలా ఆదుకుంటా
– అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపిస్తున్న   బుసిరెడ్డి పాండురంగారెడ్డి                                                                  
నవతెలంగాణ -పెద్దవూర : నల్లగొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం,యల్లాపురం తండా కు చెందిన కొర్ర భారతి (46) బుధవారం అనారోగ్యం తో స్వర్గస్తులు అయ్యారు. ఈ విషయం తెలియజేయగానే ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ వారు అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించడం జరిగింది.ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డపిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు.ఈసందర్బంగా
పాండురంగారెడ్డి మాట్లాడుతూ అన్నదానం దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమే.భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు “అహంబ్రహ్మస్మి” భావనతో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నాను అని  తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.