రెంజల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రజారానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ కు ఈనెల 30న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయ గౌడ్న, నరేందర్, బాలాజీ, మహేందర్ తదితరులు ఉన్నారు.
బోర్గం గ్రామంలో
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సర్పంచ్ వార్త వాణి సాయి రెడ్డి, ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, సింగిల్ విండో చైర్మన్ మొయినొద్దిన్, పార్ధ రాజు, ప్రవీణ్ తదితరులు ప్రచారం చేశారు.
పేపర్ మిల్ గ్రామంలో
రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు అవేజ్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దౌలత్ ఖాన్, నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు.