
అంగన్వాడీ కేంద్రాలను పిల్లలు, తల్లులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని భువనగిరి సీడీపీఓ ఎం. స్వరాజ్యం కోరారు. బుధవారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ నగర్, అర్బన్ కాలనీల్లో నిర్వహించిన” ఈ సీ సీ డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం 3+,4+ పిల్లలకు ప్రోగ్రేస్ కార్డు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కే. పద్మ అంగన్వాడీ టీచర్లు కే. సునీత, సీ ఎచ్ రూప , అంబేద్కర్ నగర్, అర్బన్ కాలనీ తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.