
మండలంలోని చౌట్ పల్లిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి స్వర్గీయ ఏలేటి మహిపాల్ రెడ్డి 33వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న మహిపాల్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, తనయులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, ఏలేటి నాగార్జున్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి సమాధిపై పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించారు. అనంతరం ఈ ప్రాంతంలో మహిపాల్ రెడ్డి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వి. నరసింహారెడ్డి, బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మండల అధ్యక్షులు కట్ట సంజీవ్ కుమార్,బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.