అతిపెద్ద పులుల అభయారణ్యం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

అతిపెద్ద పులుల అభయారణ్యం
ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదంన్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం (టైగర్‌ రిజర్వు) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పచ్చజెండా ఊపింఇ. సుమారు 2300 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఈ రిజర్వు ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌ లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం (నౌరాదేహి విల్డ్‌లైఫ్‌ శాంక్చురీ), రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపివేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు సాగర్‌, దమోహ్, నర్సింగ్‌పుర్‌, రైసెన్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ వల్ల దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరగడంతోపాటు, స్థానికంగా పర్యాటక రంగం మరింత అభివద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ‘ఈ టైగర్‌ రిజర్వు కారణంగా దమోహ్ ప్రాంతం అభివద్ధి చెందుతుంది. పర్యాటకం పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దమోహ్ కు ఇదో గొప్ప బహుమతి. రాబోయే మూడు నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని దమోహ్ డివిజన్‌ అటవీ శాఖ అధికారి ఎంఎస్‌ ఉకెరు తెలిపారు.