మహిళా కమిషన్ చైర్ పర్సన్ సఖి కేంద్రం సందర్శన

Chairperson of Women's Commission visits Sakhi Centreనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ ప్రభుత్వం నుండి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద  యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి సఖీ కేంద్రాన్ని  సందర్శించారు. సఖీ కేంద్రం లోని సిబ్బిందిని వారి వారి బాధ్యతలను అడిగి తెలుసుకున్నారు. సార్ప్ సంస్థ (సఖీసపోర్ట్ సంస్థ ) డాక్టర్ ప్రమీల , 2019 నుండి మొత్తం సఖీ లో నమోదు అయిన కేసుల కోసం వివరించడం జరిగిందని తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 1311 కేసులు నమోదు అయినవి అని తెలిపినమని, షెల్టర్ , సిబ్బింది చేసే సేవలు బాగున్నాయి అని ప్రశంసించారు.  వీరితోపాటు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరసింహారావు , సి.డి.పి.ఓలు  స్వరాజ్యం , శైలజ  పాల్గొన్నారు.