ఛామల కిరణ్ రెడ్డి ని ఆశీర్వదించాలి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఆశీర్వదించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాతాళ్లగూడెం, సంగెం, వర్కట్పల్లి గోకారం, గొల్లపెల్లి,నాగారo గ్రామాలలో ఇంటింటీ ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతో  కృషిచేస్తుందని, పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేశారని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వo వస్తే రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని భువనగిరి ఎంపీగా ఛామల కిరణ్ కుమార్  రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో పలువురి చేరిక ..
మండలంలోని దాసిరెడ్డిగూడెం కు చెందిన కొమురెల్లి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారుగా  50 మంది వివిధ పార్టీల కార్యకర్తలు, వేములకొండ నుండి, రెడ్లరేపాక నుండి కొంత మంది కార్యకర్తలు స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తి రెడ్డి, వాకిటి అనంతరెడ్డి,గుఱ్ఱం లక్మారెడ్డి, గూడూరు శివశాంత్  రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తుమ్మల యూగందర్ రెడ్డ్, బోళ్ల శ్రీనివాస్ ,పబ్బు ఉపేందర్ బోస్, నోముల మల్లేష్, బెలిద నాగేశ్వర్, సామ రాం రెడ్డి,  సహదేవ, పల్లెర్ల సుధాకర్,రాములు తదితరులు పాల్గొన్నారు.