ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం..

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ – మీర్ పేట్

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 16వ డివిజన్ పరిధిలో శ్రీ సాయి కృపాకాలనీలో నివాసం ఉంటున్న రాజశేఖర్ కు  ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60వేల రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. రాజశేఖర్ గుండెకు సంబంధించిన సమస్యతో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దింతో మీర్ పేట్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ సంప్రదించగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. బాధితులు రాజశేఖర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా రూ 60వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్ సిద్దాల బీరప్ప తదితరులు ఉన్నారు.