నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్గా నియమితులైన పీవీఎస్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ అందిస్తున్న పలు ప్రజా ప్రయోజన పథకాలను ఆమెకు వివరించారు. కొత్త పోస్టులో రాణించాలని ఈ సందర్భంగా శాంతికుమారి ఆయన్ని అభినందించారు.