నవతెలంగాణబ్యూరో హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కమిటీ చైర్మెన్, మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీని నియమించింది. కన్వీనర్లుగా జి నిరంజన్, చెరుకు సుధాకర్, సభ్యులుగా అనంతుల శ్యామ్ మోహన్, రియాజ్, రవి,జ్ఞానసుందర్ను నియమించింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరేర్చిన రోజును ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూన్ 2న అన్ని జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఆయా జిల్లాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని కోరారు.