పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పసర సీఐ,ఎస్ఐ

నవతెలంగాణ – గోవిందరావుపేట
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం మండలంలోని ముత్తాపూర్ మచ్చాపూర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సిఐ శంకర్ ఎస్ ఐ కమలాకర్ లు పరిశీలించారు. ఈ క్రమంలో ఆ  పోలింగ్ సెంటర్స్ లో గతం లో జరిగిన ఎన్నికల గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భం లో సీఐ శంకర్, ఎస్ ఐ కమలాకర్  మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి భయ భ్రాంతులకు,ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని ,ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం లో వేయడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుందని తెలియచేసారు.