
నవతెలంగాణ – భువనగిరి రూరల్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మూసీ ప్రక్షాలణ, సుందరీకరణ కోసం బడ్జెట్ నందు 1000 కోట్లు కేటాయించినందుకు భువనగిరి ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూసి ప్రక్షాలణ వలన రైతులకు శుద్ధమైన సాగు నీరు లభిస్తున్నదని, ఇట్టి బడ్జెట్ కేటాయింపు వలన భువనగిరి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యేలు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల శామ్యూల్, వేముల వీరేశం, రామ్మోహన్ రెడ్డి లు పాల్గోన్నారు.