లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం చెక్కులు అందజేత

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన పర్వవ్వ కుటుంబానికి మంజూరైన 30 వేల రూపాయల చెక్కును అలాగే మండలంలోని దన్నూరు గ్రామానికి చెందిన అనుమంతు కుటుంబానికి 15వేల రూపాయల చెక్కును శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ దన్నూర్ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు మారుతి ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి ఆయా గ్రామాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.