నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు ప్రకటన సందర్బంగా చిరంజీవి ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు. చిరంజీవికి అవార్డు రావడం అందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా అన్నారు.