
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజలకు సీఎం సహాయ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దౌల్తాబాద్ మండలం ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు బండారు దేవేందర్ అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన కొండయ్య స్వామికి రూ.43,500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం ప్రగతి బాటలో నడిచినట్లని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యానికి గురైై ప్రాణాలను పోగొట్టుకోవద్దన్న సంకల్పంతో వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆదుకోవడం కోసం సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా సరే అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్, రమేష్, నర్సింలు, లచ్చయ్య, రాజు, పనసరెడ్డి, శ్రీకాంత్, స్వామి, రాజు, నర్సింలు, లచ్చిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.