
– రిజిస్ట్రేషన్లు లేని ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయింపు
– స్థలాలను అమ్ముకుంటున్న రీయల్ ఎస్టేట్ వ్యాపారులు
– గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన కబ్జా దారులు
– నేటికి చర్యలు శూన్యం…?
– నిద్రావస్థలో రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారులు
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణ దారులు యధేచ్చగా కబ్జాకు పాల్పడుతూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు.ఈ తతంగం అంతా కూడా గత బి.ఆర్.యస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. ఆనాడు మంత్రి క్యాంపు కార్యాలయం సపోర్ట్ తో కబ్జా దారులతో పాటు, బి.ఆర్.యస్ నాయకులో కొందరు ప్రభుత్వ భూములను అప్పనంగా అక్రమిoచుకున్నారు. ప్రధానంగా పట్టణంలోని జేజే నగర్ లో గల 817 సర్వే నెంబర్ లో ఒక ఎకరం ఆరు గుంటల స్థలం,స్థానిక కిరాణం ఫ్యాన్సీ అసోసియేషన్ భవనం వెనుక గల వక్ఫ్ బోర్డు కు చెందిన 639 సర్వేనెంబర్ లోని 1.20 గుంటల విస్తీర్ణం గల భూమి కబ్జాలకు గురైంది. ఇక కుడ కుడా లోని 126 వ సర్వే నెంబర్ లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏకంగా రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం.వీటికి ఆనాడు జిల్లా స్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి అధికారులు మద్దతు ఇవ్వడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా ఆనాడు కొందరు నిరుపేదలతో పాటు జర్నలిస్టులు గత ఐదు సంవత్సరాలుగా ఆనాటి మంత్రి ప్రస్తుత హ్యాట్రిక్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చుట్టూ ఇండ్ల స్థలాలు కావాలంటూ ప్రతి రోజు ప్రదక్షిణలు చేశారు.కాగా వీరిని కాదని వినూత్నoగా క్యాంపు కార్యాలయo లో భజన చేసే బి.ఆర్.యస్ నాయకులతో పాటు కొందరూ జర్నలిస్టులకు 126 సర్వే నెంబర్ లో ఒక్కొక్కరికి 200 గజాల స్థలం నుండి 1000 గజాల స్థలం వరకు కేటాయించడం గమన్హారం.

