
ప్రజావాణి కు వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ 73, సర్వే కార్యాలయం 5డీసీఎస్ఓ కార్యాలయం 7,సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం 23, డీడబ్ల్యూఓ కార్యాలయం 4,ఉపాధి కల్పన కార్యాలయం 6,ఎస్డీసీ కార్యాలయం 2, ఎంపీడీవో కార్యాలయం కోనరావుపేట 2,ఎంపీడీవో కార్యాలయంతంగళ్లపల్లి 4,మిషన్ భగీరథ ఇంట్ర 2, ఎక్సైజ్ 1, డిపిఓ 4, ఎంపీడీవో చందుర్తి 1 , పోలీస్ శాఖ మూడు, విద్యాశాఖ 5, డి సి ఓ రెండు, డి ఆర్ డి ఓ 1, సెస్ 2, మున్సిపల్ కమిషనర్ వేములవాడ 2, పశు సoవర్ధక శాఖ ఒకటి వచ్చాయి. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.