వచ్చే ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయో చెప్పండి: కలెక్టర్

నవతెలంగాణ – సిరిసిల్ల
అధికారులు జవాబీదారుగా విధులు నిర్వహించాలని  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రానున్న ప్రజావాణిలో ఏ ఏ శాఖ వద్ద ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయో తెలుపాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో ఆయా శాఖలకు రెవెన్యూ 35 ,సెస్ 208, డీఎంహెచ్ఓ  కార్యాలయం 2, డీపీఓ కార్యాలయం 10,సర్వే కార్యాలయం 4,డీసీఎస్ఓ కార్యాలయం 1, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం 14,ఎస్పీ కార్యాలయం 1,డీడబ్ల్యూఓ కార్యాలయం 2,ఉపాధి కల్పన కార్యాలయం 15,ఎస్డీసీ కార్యాలయం 4,ఎంపీడీవో కార్యాలయం కోనరావుపేట 2,ఎంపీడీవో కార్యాలయంతంగళ్లపల్లి 4,ఎంపీడీవో కార్యాలయం ఇల్లంతకుంట, వేములవాడ ఒకటి చొప్పున డీసీఓ బీసీ కార్యాలయం, ఎల్డీఎం, డీఆర్డీఓ, ఇరిగేషన్, వేములవాడ మున్సిపల్, ఎక్సైజ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒకటి చొప్పున వచ్చాయి. మొత్తం 312 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.